నూతన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముకి శుభాకాంక్షలు

భారత రాష్ట్రపతిగా ఎన్నికైన గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నానంటూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయ వృత్తితో జీవితాన్ని ప్రారంభించి నగర పంచాయతీ కౌన్సిలర్ నుంచి రాష్ట్రపతి స్థాయి వరకూ సాగిన శ్రీమతి ముర్ము గారి రాజకీయ ప్రస్థానం ఆదర్శనీయం. బడుగు, బలహీన, అణగారిన వర్గాల వారికి ఆమె చేసిన సేవలు బహుదా ప్రశంసనీయం. శాసనసభ్యురాలిగా, ఒడిశా రాష్ట్ర మంత్రిగా, జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ గా ఆమె నిర్వర్తించిన పదవులు, అనుభవం రాష్ట్రపతిగా రాణించడానికి ఆమెకు ఆలంబనగా నిలుస్తాయని భావిస్తున్నాను. సర్వోత్కృష్టమైన భారత రాష్ట్రపతి పదవికి ఆమె మరింత వన్నె తేవాలని, సమభావంతో చక్కటి పాలన అందించాలని నా తరఫున, జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.