బొబ్బిలిలో శ్రీ రామ మందిర ప్రతిష్ట సంబరాలు

బొబ్బిలి: చారిత్రాత్మకమైన శ్రీ రామజన్మభూమి అయోధ్యలో 550 సంవత్సరాల తర్వాత శ్రీ రామ మందిరం నిర్మాణం మరియు శ్రీబాలరాముడు ప్రాణ ప్రతిష్ట జరగడం యావత్ భారతావని పండగ జరుపుకుంటుంది. ఈ సందర్భంగా బొబ్బిలి టౌన్ లోగల ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీ రాములవారి జెండాలు మరియు పులిహోర ప్రసాదంగా పంపిణీ చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొబ్బిలి మండల అధ్యక్షులు గంగాధర్ సంచాన, యువ నాయకులు, రాజా పళ్లెం, శివశంకర్ పోతల, యందువ సత్యనారాయణ, గేదెల శివ, నరేష్ కలిశెట్టి, కిరణ్ రేవళ్ల, బేతనపల్లి జగన్, సాయి, సంతోష్, జాన్, చరణ్ అలాగే వీరమహిళలు, రమ్య, తులసి, సంతోషి తదితరులు పాల్గొన్నారు.