ఎమ్మిగనూరు జనసేన ఆధ్వర్యంలో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఎమ్మిగనూరు నియోజకవర్గం నందు జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన నాయకులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు గర్భిణీ స్త్రీలకు, పేసేంట్లకు, పండ్లు, బ్రెడ్, పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు రాహుల్ సాగర్, కర్ణం రవి, బజారి లు మాట్లాడుతూ జనసేన పార్టీని స్థాపించిన ఈ పది సంవత్సరాల్లో ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ ప్రజలకి అండగా నిలబడిందని అన్నారు. మరోవైపు వ్యవసాయం కలసిరాక ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసిన ఏకైక పార్టీ జనసేన పార్టీ అని తెలిపారు, రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్కసారి జనసేన మరియు పవన్ కళ్యాణ్ గారి వైపు చూడాలని, ఎందుకంటే ఏ అధికారం లేనపటికీ ప్రజలకి అండగా నిలిచి ప్రజల హృదయాలను గెలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని అలాంటి నాయకుడికి ఒక్కసారి అధికారం ఇస్తే ప్రజల జీవితాల్ని మారుస్తారని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రషీద్, వెంకటేష్, రమేష్, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.