మేడ గురుదత్ ప్రసాద్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ ఆధ్వర్యంలో కోరుకొండ మండలం, కనుపూర్ గ్రామ హరిజన వాడలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. రాజ్యాంగ ఫలాలు అన్ని వర్గాల వారికి అందాలనే రాజ్యాంగ స్ఫూర్తిని రాజకీయాలకు అతీతంగా అమలుపరిచే రోజు రావాలని, ప్రజల్లో రాజ్యాంగం పట్ల అవగాహన రావాలని ఆకాంక్షిస్తూ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జనసైనికులు జరిపారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.