జనఘోష-జనసేన భరోసా

ఉరవకొండ నియోజకవర్గం: బెళుగుప్ప మండల కేంద్రంలో జనఘోష-జనసేన భరోసా కార్యక్రమాన్ని శనివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని బెళుగుప్ప మండల అధ్యక్షుడు కాసంశెట్టి సుధీర్ అధ్వర్యంలో ప్రారంబించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్ హాజరయ్యారు. జనఘోష -జనసేన భరోసా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం జనసేన ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజలలోకి తీసుకువెళ్లి జనసేన పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తూ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచిపనిని, షణ్ముఖ వ్యూహం గురించి ప్రజలకు వివరిస్తు వై.కా.పా. ప్రభుత్వం చేసిన అవినీతిని యెండ కడుతు వై.సి.పి. విముక్త ఆంధ్రప్రదేశ్ సాధించడమే లక్ష్యంగా జనసేన పార్టీ ప్రణాలిక సిద్దం చేసిందని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడాలని బెళుగుప్ప గ్రామ ప్రజలకు కరపత్రం ద్వారా జనసైనికులు తెలియజేసారు. ఈ కార్యక్రమములో ఉరవకొండ మండల అధ్యక్షులు చంద్రశేఖర్, విడపనకల్ మండల అధ్యక్షులు టి.గోపాల్, కూడేరు మండల అధ్యక్షులు నాగేష్, బెళుగుప్ప మండలఉపాధ్యక్షులు మధు, రామంజి, ప్రదాన కార్యదర్శులు నాని, మోహన్ జనసేన నాయకులు మంజు, మురళి, మణి, మల్లికార్జున, శేఖర్, రవినాయక్, భోగేష్, మనోజ్ పాల్గొన్నారు.