అగ్ని ప్రమాద బాధితులకు ఆర్ధిక సహాయాన్ని అందించిన విశ్వనాథపల్లి జనసేన

కృష్ణాజిల్లా, అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని కోడూరు మండలంలోని విశ్వనాథపల్లి గ్రామం లో గత వారం జరిగిన అగ్నిప్రమాదంలో తమ సర్వస్వం కోల్పోయిన కొండవీటి వెంకటేశ్వరావు, శివాజీ ల కుటుంబాన్ని విశ్వనాథపల్లి జనసేన పార్టీ నేతలు పరామర్శించి తమ వంతు సహాయంగా 40 వేల రూపాయిల ఆర్ధిక సహాయాన్ని మండల అధ్యక్షులు మర్రే గంగయ్య , జిల్లా సంయుక్త విభాగ సభ్యులు కొండవీటి సునీత మరియు గ్రామ ఎంపీటీసీ అభ్యర్థి తోట లక్ష్మణరావు చేతుల మీదగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమం లో గ్రామ క్రియాశీలక సభ్యులు ముప్పిరిశెట్టి నాగమల్లేశ్వరావు, కొండవీటి లక్ష్మయ్య, కోలా శివయ్య, ధూళిపూడి శేఖర్, కొండవీటి నాగరాజు, గోళ్ళ నాగమల్లేశ్వరావు, కొండవీటి శివరాం, కొండవీటి నాగేంద్ర, ఒడుగు నాయక్ మరియు జనసేన అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.