రంజాన్ పండుగ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్

నంద్యాల జిల్లా, నందికొట్కూరు నియోజకవర్గం, కొత్తపల్లి మండలం ముసలిమడుగు గ్రామంలో రంజాన్ పండుగ సందర్భంగా ముసలిమడుగు గ్రామంలోని యువకుల సమక్షంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్య అతిధులగా జనసేన నాయకులు ఎస్.జి ఇక్బాల్, యూత్ లీడర్ సులేమాన్, సద్దాం హుస్సేన్ మరియు యువకులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఇందులో ఇక్బాల్ మాట్లాడుతూ యువత క్రీడా రంగంలో ముందుకు రావాలని వాళ్లకి ఏ విధమైన అవసరం వచ్చిన వారికి అండగా ఉంటామని చెప్పడం జరిగింది.