హామీలు నెరవేర్చే దమ్ములేక దద్దమ్మ కబుర్లెందుకు?: జగన్ పై పితాని ఫైర్

ముమ్మిడివరం: ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గం ఇన్చార్జి పితాని బాలకృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సామర్లకోట పర్యటనలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను, ప్రతిపక్ష పార్టీలు పై చేసిన విమర్శలపై ఫైర్ అయ్యారు. ప్రజలు అనేక ఇబ్బందులలో ఉంటే వాటిని కప్పిపుచ్చే ప్రయత్నమే జగన్ విమర్శలు. జగన్మోహన్ రెడ్డి వన్నీ దద్దమ్మ కబుర్లు.. పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. కష్టార్జితంతో పవన్ కళ్యాణ్ ప్రజాసేవ చేస్తుంటే.. జగన్ దోపిడీ సొమ్ముతో విలాసవంతమైన జీవితం గడుపుతూ దొంగ మాటలు మాట్లాడుతున్నాడు. వృత్తి రీత్యా హైదరాబాద్ లో ఉంటున్న పవన్ ను, పవన్ కళ్యాణ్ వివాహాలు గురించి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డికి త్వరలోనే ప్రజలు గుణపాఠం చెప్పనున్నారు. జనసేన, టిడిపి పార్టీలు బిజెపి కూడా కలిసి వస్తుందని నమ్మకంఉంది‌. మేము అధికారంలోకి రావడం కాయం. వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దోపిడీని బయట పెట్టి భరతం పట్టడం కాయం. విద్యుత్ సరిగా సరఫరా లేక ఆక్వా రైతులు, పంటలకు సాగునీరు సరఫరా లేక రైతులు, అధికదరలతో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులలో ఉంటే అవి పట్టించుకోకుండా ప్రతిపక్షాలమీద విమర్శలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి చేతకాని పాలన సాగిస్తున్నాడు. రానున్న ఎన్నికల్లో వీరి పాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారు.