నిద్రపోతున్న సీఎం గారు మెల్కోండి: పిడుగురాళ్ల జనసేన

ఉమ్మడి గుంటూరు జిల్లా: జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల సమస్యలపై నిర్వహించబోయే డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా మొదటి రోజు శుక్రవారం ఉమ్మడి గుంటూరు జిల్లా, గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల మండలం నందు అద్వానంగా ఉన్న రోడ్ల పరిస్థితులపై జనసైనికులు సోషల్ మీడియా వేదికగా.. ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా.. నిరసనగలం తెలియజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల కాసిం సైదా, ప్రోగ్రాం కమిటీ సభ్యుడు సలీం, బయ్యవరపు రమేష్, చీదెల్ల, రామకృష్ణ, శ్రీకాంత్, మదీనా, అశోక్, రవి పాల్గొన్నారు.