యూకేలో జనసేన-టీడీపి మొదటి ఉమ్మడి సమావేశం

లండన్, రాబోయే 2024 ఎన్నికల్లో జనసేన-టీడీపి పార్టీల పొత్తులో భాగంగా, జనసేన-టీడీపికి సంబంధించిన ఎన్నారై కోర్ కమిటీ సభ్యులు ఆదివారం సాయంత్రం లండన్ నగరంలో సమావేశమవడం జరిగింది. సమావేశంలో ముందుగా తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడి మీద పెట్టిన అక్రమ కేసులని, అక్రమ అరెస్టుని ఖండిస్తూ తెలుగుదేశానికి బాసటగా నిలిచిన పవన్ కళ్యాణ్ కి, జనసేన పార్టీకి ఎన్నారై తెలుగుదేశం యూకే విభాగం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో జనసేన-టీడీపి జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకుని, ఆ కమిటీ తీసుకునే నిర్ణయాలకి, ఇరు పార్టీలు తీసుకునే నిర్ణయాలకి కట్టుబడి సమిష్టిగా, యూకేలోని జనసేన-టీడీపి ఎన్నారైలు పనిచేసే విధంగా కార్యక్రమాలు రూపొందించాలని నిర్ణయించారు. ఇరు పార్టీల ముఖ్య సభ్యులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత చాలా ఉందని, కలిసికట్టుగా పనిచేసి, అరాచక వైసీపీ పాలనని అంతమొదించాలని సభ్యులందరూ తమ అభిప్రాయాలను తెలియజేశారు. అనంతరం

సైకో పోవాలి..ఏపీ బాగుపడాలి
హలో ఏపీ..బై బై వైసీపీ
జనసేన – టీడీపీ ఐక్యత వర్ధిల్లాలి అనే నినాదాలతో హోరెత్తించారు

తదుపరి ప్రణాళికను రూపొందించుకుని, కలిసికట్టుగా పనిచేసి, ప్రజలను చైతన్యపరచి, దుర్మార్గపు వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దించి, రాష్ట్రాభివృద్ధి కోసం తమ వంతు కృషిచేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో ఇరు పార్టీలకి సంబంధించిన కోర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.