జనంకోసం జనసేన 266వ రోజు

  • వనరక్షణలో భాగంగా 800 మొక్కలు పంపిణీ

జగ్గంపేట నియోజకవర్గం, జనంకోసం జనసేన 266వ రోజులో భాగంగా జనసేన వనరక్షణ దానిమ్మ మొక్కల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం జగ్గంపేట గ్రామంలో జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఆదివారం 800 మొక్కలు పంచడం జరిగింది. మొత్తం 34200 దానిమ్మ మొక్కల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల టైలర్స్ సెల్ అధ్యక్షులు కిలాని శివాజీ, జగ్గంపేట మండల ఎస్సి సెల్ అధ్యక్షులు బీడీల రాజబాబు, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల అధికార ప్రతినిధి పాలిశెట్టి సతీష్, జగ్గంపేట మండల సోషల్ మీడియా సమాచార కార్యదర్శి దాడి మణికంఠ, రామవరం ఎంపిటిసి దొడ్డ శ్రీను, చిన్ని సతీష్, జట్లా వీరభద్ర, టంకు స్వామి, కేత నరేష్, దమ్ము వీరబాబు, పవిడిశెట్టి సాయి చంద్ర(బుజ్జి), యర్రా సాయి, బుదిరెడ్డి వంశీ, మల్లిశాల నుండి వట్టికూటి జనార్ధన్, కాట్రావులపల్లి నుండి బంగారు రామస్వామి, జె.కొత్తూరు నుండి గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, రామవరం నుండి అడపా రాంబాబు, గోనేడ నుండి వల్లభశెట్టి నాని లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలియజేసారు.