జనసేనాని దృష్టికి శ్రీమద్ కదిరి లక్ష్మి నరసింహ స్వామి కోనేరు సమస్య

తిరుపతిలో జరిగిన రాయలసీమ మరియు నెల్లూరు జిల్లాల ప్రజా సమస్యలను జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను నేరుగా ప్రజల నుంచే తీసుకుంటున్న తరుణంలో అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి శ్రీమద్ కదిరి లక్ష్మి నరసింహ స్వామి కోనేరు సమస్యను, నంబుల పూలకుంట వంకమద్ది గ్రామ రోడ్డు సమస్య గురించి తెలపడం జరిగింది. సహకారం అందించిన ఇంచార్జీ భైరవ ప్రసాద్ గారికి, కదిరి నియోజక వర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని శ్రీసత్య సాయి జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ కుటాల తెలిపారు.