జనం చెంతకు జనసేన 5వ రోజు

పాలకొల్లు నియోజకవర్గం పోడూరు మండలం, బోనం చినబాబు ఆధ్వర్యంలో పోడూరు మండల అధ్యక్షులు పితాని వెంకటేష్ అధ్యక్షతన, జనం చెంతకు జనసేన కార్యక్రమం 5వ రోజు వేడంగి గ్రామంలో రెండవ రోజు విజయవంతంగా ముగిసింది. ఈ గ్రామంలో అధికారంలో ఉన్న పార్టీ చేసే అక్రమాలను, అవినీతి పరిపాలనను, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటూ, వాటికి పరిష్కారం వచ్చే దిశగా జనసేన ఎప్పుడు ముందుంటుంది అని ప్రజలకు జనసేన ఎప్పుడూ అండగా నిలబడుతుందని, మండల అధ్యక్షులు పితాని వెంకటేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఉన్నమట్ల ప్రేమ్ కుమార్, పోడూరు మండలం ఎంపీటీసీ నరసింహారావు, మానేపల్లి శ్రీధర్, గ్రామ అధ్యక్షులు కొర్రకూటి హరి, వేడంగి పాలెం అధ్యక్షులు లంకలపల్లి ప్రసాద్, వీర మహిళలు రియా, పద్మజ, విష్ణుకుమారి, జనసైనికులు వెంపటాల, వంశి, బోర్ర మణికంఠ, గుబ్బల ఉదయ్ భాస్కర్, చందు, శ్రీను పాల్గొన్నారు.