జనం కోసం జనసేన 573వ రోజు

జగ్గంపేట: జనం కోసం జనసేన 573వ రోజులో భాగంగా జనసేన వనరక్షణ ద్వారా ప్రతి ఇంటికి కొబ్బరి మొక్కల పంపిణీ కార్యక్రమం గోకవరం మండలం ఆర్, ఆర్ కాలనీ గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 300 కొబ్బరి మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 4650 కొబ్బరి మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 574వ రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గోకవరం మండలం కాలనీ గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 300 కాలనీ గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. మంగళవారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి దోసపాటి సుబ్బారావు, దేవిపట్నం మండల అధ్యక్షులు చారపు వెంకట రాయుడు, గోకవరం మండల ప్రధాన కార్యదర్శి వీరవల్లి పోసిబాబు, ఆర్, ఆర్ కాలనీ గ్రామ అధ్యక్షులు తైలం రమేష్, సోలా దుర్గ, గురుగుల నిఖిలేంద్ర సాయి, కోమలి దుర్గాప్రసాద్, చాండ్ర ఆదిత్య, సిద్దా రామారావు, వీరవల్లి జితేంద్ర, చామకూరి కిషోర్, రవిచంద్ర, గోకవరం నుండి దూళ్ళ నాగేంద్ర, గండ్రెడ్డి ఫణి అనిల్ కుమార్ , రెడ్నం సుధీర్, కొత్తపల్లి నుండి మాదారపు ధర్మేంద్ర, మాదారపు విక్రమ్, వనుం ప్రదీప్, జె.కొత్తూరు గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, గోనేడ నుండి నల్లంసెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నానినానిలకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా నాయకంపల్లి గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన బోడా పోలరాజు కుటుంబ సభ్యులకు, అల్లాడి వీరబాబు కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.