ఆంధ్రా అభివృద్ధి – జనసేన తోనేసాధ్యం

నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, సుబ్బారెడ్డి పాలెంలో కార్యక్రమాన్ని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి, ముత్తుకూరు మండల అధ్యక్షులు మనుబోలు గణపతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు జనసేన నాయకులతో మాట్లాడుతూ సంవత్సరాలు గడుస్తున్నా వీధి లైట్లు లేక చీకటిలో ఉండాల్సివస్తుందని వాలేంటీర్ కి చెప్పినా, స్థానిక నాయకులకు చెప్పినా సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాగవేటి రమేష్, తాండ్ర శ్రీను, ఊటుకూరు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.