ఆంధ్రా అభివృద్ధి – జనసేనతోనే సాధ్యం 18వ రోజు

సర్వేపల్లి: ఆంధ్రా అభివృద్ధి – జనసేనతోనే సాధ్యం 18వ రోజు కార్యక్రమం నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, మిట్టపాలెం గ్రామంలో జరిగింది. కార్యక్రమంలో గ్రామస్థులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ఇబ్బంది పడుతూ విసిగిపోయామని, ఈ వ్యవస్థను మార్చాలంటే పవన్ కళ్యాణ్ రావాలని, ఈ సారి జనసేన పార్టీకి అవకాశం ఇస్తామని గ్రామస్తులు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి, ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నీళ్ల విష్ణు, తాండ్ర శ్రీను పాల్గొన్నారు.