నెల్లూరు జనసేనలో భారీ చేరికలు

నెల్లూరు జిల్లా జనసేన కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు, కార్యదక్షతకు ఆకర్షితులై వంద మంది యువకులు జనసేన జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారిని, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ మున్వార్ ఆధ్వర్యంలో మా బాషా నాయకత్వంలో జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ పట్టణ అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ మాట్లాడుతూ అనేక మంది యువకులు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు ఆకర్షితులు అయి జనసేన పార్టీ లో కి చేరటం ఒక గొప్ప మార్పుకి ప్రారంభం అని అన్నారు. రాబోయే రోజులో జనసేన పార్టీ నెల్లూరు నగరం లో గడప గడపకి జనసేన కార్యక్రమం మొదలు చేయబోతుంది అని వైసీపీ పాలనా లో ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను ప్రతి గడపకి తెలిసేలా జనసేన పార్టీ ముందుకువెళ్తుంది అని వై ఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినా దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీవ్ర కష్టాలు ఎదురుకుంటున్నారు అని ప్రజలు పనులు దొరక బ్రతుకు భారం అయి రాష్ట్రాన్ని వదిలి వలస వెళ్తున్నారు అని అన్నారు. నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు మాట్లాడుతూ వివేకానంద జయంతి సందర్బంగా రణస్థలం లో జరిగిన యువశక్తి సభకు ఆకర్షితులు అయి యువకులు పార్టీ లో చేరటం ఆనందంగా వుంది అని త్వరలో నగరం లో జిల్లాలో ఎంతో మంది నాయకులూ కూడా ఇతర పార్టీలో నుంచి జనసేన లో కి వస్తారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్, నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శికి మున్వార్, జిల్లా నాయకులూ అల్తాఫ్, శ్రీధర్, మాబాషా, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.