కాన్సర్ బాధితునికి జనసేన ఆర్ధికసాయం

ఆమదాలవలస నియోజకవర్గం ఐ.జె నాయుడు కోలనీ చెందిన కాయల ఖాళీదాసు గత కొద్ది కాలంగా గైన్ట్ సెల్ కాన్సర్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. సరుబుజ్జీలి మండలం రేపటి ప్రయోజనం ఫౌండేషన్ వారు 10,000 రూపాయలు ఆర్ధిక సహాయం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్పీ ఫౌండేషన్ సభ్యులు పేడాడ రామ్మోహనరావు ( ఆమదాలవలస నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జ్) మరియు భార్గవ్, లంకలపల్లి సురేష్, రమేష్, పైడి మురళీ మోహన్, సతీష్, సురేష్, గణేష్, మణి, రాధాకృష్ణ పాల్గొని విరాళం అంద చెయ్యటం జరిగింది.