పవనన్న ప్రజాబాట కార్యక్రమం 98వ రోజు

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గంలో, లావేరు మండలం లావేటి పాలేం పంచాయతీ కేశవరాయినిపాలేం గ్రామంలో ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు మరియు సోసైటి బ్యాంకు మాజీ చైర్మన్ కరిమజ్జి. మల్లేశ్వరరావు పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా 98వరోజు సీతారాం పురం గ్రామంలో, ప్రతి ఇంటింటికి వెళ్లి జనసేన సిద్ధాంతాలను మరియు మ్యేనిఫేస్ట్ గురించి.. రాష్ట్రాములో గతంలో మరియు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు ప్రజలను ఏ విధంగా, మభ్యపెట్టి మోసం చేస్తున్నాయో, ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది..
ప్రతి ఒక్కరి జీవితాలు బాగుండాలి, యువత అందరకి కూడా జాబులు రావాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని ఆదరించి, గాజు గ్లాస్ గుర్తుకి ఓటు వేసి, జనసేన పార్టీని గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరుపేరునా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రణస్థలం మండలం జనసేన పార్టీ నాయకులు కృష్ణాపురం పంచాయతీ యంపిటిసి అభ్యర్థి పోట్నూరు.లక్ష్మునాయుడు, దన్నాన.భోగినాయుడు రాంబాబు, కృష్ణారావు, రఘ మరియు జనసేన కార్యకర్తలు, కేశవరాయిని పాలేం గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరినీ పేరు పేరునా ధన్యవాదాములు తెలియజేసారు.