గురజాల మండలంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

గురజలా నియోజకవర్గం: గురజాల మండలంలో జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా క్రియాశీలక సభ్యులకు కిట్లను పంచడం జరిగినది. ఈ సందర్భంగా జనసైనికులు మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తల కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి ఐదు లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించారని అన్నారు. అలాగే మనం 500 రూపాయలు కడితే, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కార్యకర్తల కోసం తన కష్టపడ్డ సొంత సొమ్మును 2000 రూపాయలు కలిపి, తన సొంత డబ్బును ఇన్సూరెన్స్ గా కట్టి, జనసేన కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని చెప్పడం జరిగినది. కార్యకర్తల కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి ఐదు లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించారాని అన్నారు. ఈ కార్యక్రమంలో గురజాల మండల కార్యదర్శి చవకాల వెంకట నారాయణ, మిరియాల కోటేశ్వరరావు, ప్రభాస్, రంగా మణికంఠ, తదితరులు పాల్గొన్నారు.