పెద్ధవడుగురు జనసేన ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

తాడిపత్రి నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన కుటుంబసభ్యుల భద్రత కోసం చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం ఆదివారం పెద్ధవడుగురు జనసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కదిరి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పెద్దవడుగూరు మండలంలో జనసేన పార్టీ బలపడుతుందని, జనసేన బలం పెరిగిందని ఆయన కొనియాడారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీనీ బలోపేతం చేయడంలో జనసేన పెద్దవడుగూరు మండల ఇంచార్జ్ దుద్ వలి పాత్ర అభినందనీయమని శ్రీకాంత్ రెడ్డి తెలపడం జరిగింది. సభ్యత్వాలు 150 కి పైగా మండలంలో జరగడం ఎంతో సంతోషించదగ్గ విషయమని, ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు పార్టీనీ బలోపితం చేసే పార్టీనీ ప్రజలోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించడం జరిగింది. మరో వైపు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి 20 కుటుంబాలు జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. కార్యకర్తలకి సమస్యలు ఉంటే మండల ఇంఛార్జ్ దూద్ వలినీ గానీ నన్ను గానీ నేరుగా సంప్రదించవచ్చునని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాడపత్రి జనసేన ప్రధాన నాయకులు కిరణ్, మండల ఉపాధ్యక్షులు మహేశ్, జనసేన కార్యకర్తలు బాబా జయరాం, బాబు రంగా రాజు, రాజేంద్ర, మధు, భాష, వేణు, గణేష్, పెద్దన్న, విజయ్, రాజేష్, సురేష్, మల్లి మాబు, రఫీ, శివశంకర్, నాగేంద్ర, హుస్సేన్ భాష, అల్లా బకాష్, మున్నా, పవన్ కుమార్ లాలెప్ప, సుంకన్న రవికుమార్, శివ కుల్లాయప్ప, ప్రకాష్ తదితర జనసేన కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.