మేడ భువనేశ్వరి నాయుడు వర్ధంతి సందర్భంగా చిన్నారులకు అన్నదానం పండ్లు పంపిణీ

జనగామ జిల్లా కేంద్రంలోని వర్ధన్ అనాధాశ్రమంలో మేడ భువనేశ్వరి నాయుడు వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో చిన్నారులకు అన్నదానం, పండ్లు పంపిణీ చేసారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ చిన్నారులకు అన్నదానం చేయడం చాలా తృప్తిగా ఉందన్నారు. చేరదీసిన ఆశ్రమ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. సేవ చేసేందుకు ప్రేరణ కల్పిస్తున్న పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్ సంస్థ సభ్యులను ప్రశంశించారు. ఈ కార్యక్రమంలో జోగు భాస్కర్, జంపాల సంతోష్, రంజిత్, జోగు ఉదయ్, శివ, గుజ్జుల నాలిన్, రోహిత్, సాయి, మను, నాని, ఆలకుంట్ల ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.