జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ, వాటర్ బాటిల్స్ పంపిణీ

కనిగిరి: రంజాన్ పండుగ సందర్భంగా జనసేన పార్టీ కనిగిరి పట్టణ నాయకులు అక్బర్ ఆధ్వర్యంలో కనిగిరి పట్టణంలో ఒంగోలు బస్టాండ్ నందు జనసేన పార్టీ తరపున మజ్జిగ ప్యాకెట్లు మరియు వాటర్ బాటిల్స్ పంపిణీ కార్యక్రమం జనసేన పార్టీ కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి నాగరాజు ప్రారంభించడం జరిగినది. అనంతరం జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా కనిగిరి ఆర్టీసీ డిపో వద్ద గల జ్యోతిరావు పూలే విగ్రహానికి నాగరాజు పూలమాలవేసి జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు జరిపారు. అనంతరం అక్బర్ ఇంటి వద్ద రంజాన్ సందర్భంగా విందు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ విందు కార్యక్రమానికి జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి నాగరాజు, ప్రకాశం జిల్లా ప్రోగ్రామ్ కమిటీ కార్యదర్శి రామిశెట్టి సునీల్ కుమార్, పామూరు మండలం అధ్యక్షులు దర్శి ఏడుకొండలు, పీసి పల్లి మండల అధ్యక్షులు బండారు రాజు, కనిగిరి మండలం అధ్యక్షులు ఇండ్ల రమేష్, హెచ్ఎం పాడు నాయకులు ఆకుపాటి వెంకటరావు, శానం ఆంజనేయులు, నున్న శ్రీనివాసులు, కోటం శెట్టి మధు, మల్లికార్జున, ప్రవీణ్, కమలాకర్, నాగేంద్ర, చరణ్, సాయి, నరేష్, వరద ఓబులేసు, కంచర్ల వంశీ జనసేన పార్టీ కనిగిరి నియోజకవర్గ నాయకులు జనసైనికులు కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.