విద్యుత్ ఘాతం వల్ల ఇల్లు కోల్పోయిన వృద్ధురాలికి జనసేన తరఫున ఆర్థిక సహాయం

మచిలీపట్నం అరిసేపల్లి గ్రామంలోని వృద్ధురాలైన సాక్షి సావిత్రమ్మ ఇల్లు శుక్రవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నికి ఆహుతి అవ్వడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మచిలీపట్నం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ బండి రామకృష్ణ వెంటనే స్పందించి సావిత్రమ్మ వద్దకు వెళ్లి మనోధైర్యాన్ని నింపి మచిలీపట్నం జనసేన తరఫున 10,000 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు అనంతరం బండి రామకృష్ణ మాట్లాడుతూ ఘటన జరిగి ఇన్ని రోజులైనా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం చాలా బాధాకరం అని ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరారు. అలాగే స్వచ్ఛంద సంస్థలు, అన్ని రాజకీయ పార్టీలు కుల మత పార్టీలకు అతీతంగా వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ చౌదరి మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందక పోవడం చాలా బాధాకరమని ప్రభుత్వం వెంటనే వారికి నూతన గృహం ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఉపాధ్యక్షులు ఎండి సమీర్, కర్రి మహేష్, కార్యదర్శి వడ్డి చిరంజీవి, రామ్ పంచకర్ల, బొప్పూడి చంటి మరియు ఇతర జనసైనికులు పాల్గొన్నారు.