దేవన్ పెంటయ్య వర్ధంతి సందర్భంగా అన్నదానం, పండ్లు పంపిణీ

జనగామ జిల్లా కేంద్రంలోని రాజరాజేశ్వరి అనాధాశ్రమంలో దేవన్ పెంటయ్య 2వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో అన్నదానం, పండ్లు పంపిణీ చేసారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కడారి ప్రవీణ్ మాట్లాడుతూ వృద్ధులకు అన్నదానం చేయడం చాలా తృప్తిగా ఉందన్నారు. చేరదీసిన ఆశ్రమ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. సేవ చేసేందుకు ప్రేరణ కల్పిస్తున్న పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్ సంస్థ సభ్యులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో దేవన్ నర్సింగరావు, దేవన్ సత్యం, బాలమణి, పద్మ, శారద, జోగు భాస్కర్, రంజిత్, జోగు ఉదయ్, శివ, గుజ్జుల నాలిన్, రోహిత్, సాయి మను, నాని, ఆలకుంట్ల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.