తంబళ్లపల్లె నియోజకవర్గంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

ఉమ్మడి చిత్తూరు జిల్లా: తంబళ్లపల్లె నియోజకవర్గం, పి.టి.ఎం మండలములో.. మండల అధ్యక్షులు దొరిగుండ్ల శంకర ఆధ్వర్యంలో.. మొలకల చెరువు మండల అధ్యక్షులు పోతుల సాయ్ నాధ్ మరియు పెద్ద మండ్యం మండల అధ్యక్షులు సిద్దవరం శంకర అధ్యక్షత జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కిట్ల పంపిణీ కార్యక్రమం తంబళ్లపల్లె నియోజకవర్గం మూడు మండలాలలో జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత మరియు మదనపల్లి జనసేన యూత్ లీడర్ హరి దారం చేతుల మీదుగా క్రియాశీల సభ్యత్వం చేసుకున్న ప్రతి ఒక్కరికి కిట్లను అందచేయడం జరిగింది. మరియు మండలంలో.. నియోజకవర్గంలో అధికంగా 110 సభ్యత్వాలు నమోదు చేపించిన మొలకల చెరువు మండల అధ్యక్షులు సాయ్ నాధ్, 88 సభ్యత్వాలు చేసిన పి.టి.ఎం మండలమ అధ్యక్షులు దొరిగుండ్ల శంకర, 54 సభ్యత్వాలు చేసిన పెద్ద మండ్యం అధ్యక్షులు సిద్దవరం శంకర మరియు 10 కన్నా ఎక్కువ సభ్యత్వాలు చేసిన సభ్యులను సన్మానించి వారికి ప్రశంసాపత్రాలు. పార్టీ జెండాను గౌరవార్థం అందచేయటం జరిగింది.

ఈ కార్యక్రమంలో మండల కమిటీల మరియు నియోజకవర్గ నాయకులు పి.టి.ఎం నుండి సూరి, నాగరాజు, సోము,శవన్న, నారాయణ స్వామి, బావాజాన్, మొలకల చెరువు మండలము నుండి హరి, అంజి, లక్ష్మీనారాయణ, గణేష్, షోరూం సూరి, శీన, రెడ్డి సురేష్, మైనారిటీ మండల నాయకులు బాబ్జాన్ తదితరులు, పెద్ద మండ్యం మండలము నుండి భీమయ్య, వేణు గోపాల్, ధనుంజయ, వెంకటేష్, ప్రకాష్, శంకరయ్య, రెడ్డప్ప, అర్జున, సురేష్ యాదవ్, సిద్ధప్ప, బస్ రెడ్డప్ప, రవీంద్ర, నాగార్జున వెంకటరమణ, జానకిరామ్ చరణ్ ప్రసాద్, వెంకట్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.