అక్షయపాత్ర వీధి నందు దివ్యాంగుల భరోసా యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ నాయకులు పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనల మేరకు మావులూరి సురేష్ & రాగిణిల ఆధ్వర్యంలో 39వ డివిజన్లో గల అక్షయపాత్ర వీధి నందు దివ్యాంగుల భరోసా యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ యాత్రలో భాగంగా జనసేన పార్టీ శ్రేణులు దివ్యాంగులు సూర్యనారాయణ మరియు దివ్యలతో కలిసి వారితో వారి సమస్యలపై చర్చించి భరోసానిచ్చే ప్రయత్నం చేసారు. ఈ వై.సి.పి ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనం ఇచ్చే పనుల కన్నా దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగేలా చర్యలు చేపట్టాలన్నారు. దివ్యాంగులు ప్రతి పనికీ తమ సర్టిఫికేట్లను దఖలు చేయడానికి రక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, వీరికి ప్రత్యేకమైన విధివిధానాలను ప్రవేశపెట్టాలనీ, అందుకు తగిన ఆలోచనలు రాబోయే జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ప్రభుత్వంలో మెరుగైన నిర్ణయాలతో మేలు కలుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులూ ఆకుల శ్రీనివాస్, శివ, చిరంజీవి, సతీష్, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.