బాధ్యతారహితం గా వ్యవహరిస్తున్న డాక్టర్ల ను వెంటనే సస్పెండ్ చేయాలి

పత్తికొండ: జనసేన పార్టీ నాయకులు సిజి రాజశేఖర్ మాట్లాడుతూ మంగళవారం స్వయంగా నేనే పత్తికొండ గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లడం జరిగింది. విషయం ఏమిటంటే పులికొండ గ్రామానికి చెందిన దొడ్డి ధనుంజయ, దొడ్డి రంగస్వామి కుమారుడు పురుగుల మందు తాగితే గవర్నమెంట్ హాస్పిటల్ కు 7 గంటలకు చేర్చడం జరిగింది. కానీ 8 గంటల వరకు ఒక డాక్టర్ కూడా హాస్పిటల్ నందు లేకపోవడం పేషెంట్లకు సరైన వైద్యం అందించకపోవడం చాలా బాధాకరమైన విషయం ఆ కుటుంబానికి ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత గవర్నమెంట్ హాస్పిటల్ నందు పనిచేసే డాక్టర్లు బాధ్యత వహించాలని అలాగే బాధ్యతారహితం గా వ్యవహరిస్తున్న డాక్టర్ల ను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుచున్నాను.