కుప్పం నియోజకవర్గంలో జనసేన పల్లెబాట – మొదటి రోజు

కుప్పం నియోజకవర్గం జనసేన జిల్లా అధ్యక్షులు ఆదేశాల మేరకు ఆదివారం చేపట్టిన జనసేన పార్టీ పల్లెబాట కార్యక్రమాన్ని రామకుప్పంలోని సుబ్రమణ్య స్వాములవారి దర్శనం అనంతరం రామకుప్పం మండలం గడ్డూరు గ్రామంలో అంబేడ్కర్ కు పూలమాల సమర్పించి మొదటి రోజు జనసేన పార్టీ పల్లెబాటలో భాగంగా ప్రతియొక్క ఇంటికి వెళ్లి జనసేన పార్టీ సిద్ధాంతాలు అలాగే ఇప్పటి వరకు ప్రజల తరపున పోరాడిన కార్యక్రమాలు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి రామమూర్తి, సంయుక్త కార్యదర్శులు వేణు, మునెప్ప, నవీన్, మండల అధ్యక్షులు హరీష్, మండల కమిటీ సభ్యులు భాస్కర్, శ్రీకాంత్, నవీన్, మోహన్, ఈశ్వర్, రవితేజ, బాలాజి, మురళి, అనీల్, తెంజిల్ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.