జనసేన, జికె ఫౌండేషన్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ ఆహార నిధి

జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయంకై పేద ప్రజల ఆకలి నింపే ప్రయత్నంగా ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి ఆహార నిధి కార్యక్రమం శనివారం కే.జి.హెచ్ వద్ద నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమం జనసేన పార్టీ సంయుక్త జికె ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనసేన దక్షిణ నియోజకవర్గం ముఖ్య నాయకులు గోపి కృష్ణ(జి.కే) చేతుల మీదుగా జరిగింది.

ఈ కార్యక్రమంలో జనసైనికులు మరియు ఫౌండేషన్ సభ్యులు పాపారావు, జయరామ్, సుధాకర్, గణేష్, సతీష్, అనిల్, హేమంత్,భాస్కర్, లక్ష్మణ్, తారకేశ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన ఆర్.పి రాజు, మచ్చ రాజు, పసుపులేటి మోహన్, అడపా సత్తిబాబుకి, రఘు (35వ వార్డు జె.ఎస్.పి) లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేడం జరిగింది.