మద్యాన్ని ఎప్పుడు బ్యాన్ చేస్తారో చెప్పాలని దోమకొండ అశోక్ డిమాండ్

విజయవాడ, మద్యాన్ని బ్యాన్ చేస్తానని చెప్పి, ఫ్లెక్సీలను బ్యాన్ చేసిన జగన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో మద్యాన్ని ఎప్పుడు బ్యాన్ చేస్తారో చెప్పాలని దోమకొండ అశోక్ డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపి అధికారంలోకి వచ్చాక మద్యపాన నిషేదం చేస్తానని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి మూడు సంవత్సరాలు గడుస్తున్నా మద్యపాన నిషేధం చేయకపోగా, వారి జేబులు నింపుకోవడానికి వారి బినామి పేర్లతో మద్యం కంపెనీలు పెట్టించి విషపూరితమైన మద్యాన్ని ప్రజలకు విక్రయిస్తూ వారి స్వలాభం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఆడబిడ్డల కన్నీళ్ళకు కారణమవుతున్నారు.
మద్యపాన నిషేధం చేయకపోతే ఆడబిడ్డలు మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పి జనసేన నాయకులు దోమకొండ అశోక్ జగన్ రెడ్డి గారిని హెచ్చరించారు.