ముసుగేసుకుని రాజకీయాలు చేయబాకండి.. ముద్రగడపై నిప్పులు చెరిగిన బొబ్బేపల్లి సురేష్

  • రామకోటి రాసుకోవాల్సిన ముద్రగడ పద్మనాభం జనసేనానికి లేఖలు రాయడం మీకు అంత మంచిది కాదు
  • ముద్రగడకి ఉప్మా డబ్బులు పోస్ట్ ద్వారా తిరిగి పంపిన బొబ్బేపల్లి

సర్వేపల్లి నియోజకవర్గం: వెంకటాచలం మండలం, సర్వేపల్లి గ్రామం నందు ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ.. వృద్ధాప్యంలో రామకోటి రాసుకోవాల్సిన ముద్రగడ పద్మనాభం మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాయడం మీకు అంత మంచిది కాదు. తునిలో 12 లక్షల మంది కాపులు మీకు మద్దతుగా నిలబడితే మీరు కాపులకు చేసింది ఏంది?. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం రూ.2000 కోట్ల రూపాయల నిధులు కాపు కార్పొరేషన్ కి కేటాయిస్తామని చెప్పారు. మరి ఇప్పటివరకు దానికి శ్వేతపత్రం విడుదల చేసింది లేదు. మరి ఆ రోజు ఎందుకు మీరు లేఖ రాయలేదు. కాపు రిజర్వేషన్ గురించి ఎక్కడా కూడా ఇప్పటివరకు ప్రస్తావన జరగలేదు. దాని గురించి ఎందుకు మీరు లేఖ రాయలేదు. వైసీపీ వాళ్లు మాట్లాడితే వేదాంతాలు, మా అధినేత మాట్లాడితే బూతులా, ఆడపడుచులపై, వీరమహిళలపై ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వైసిపి ఎమ్మెల్యే కించపరిచే విధంగా మాట్లాడి ఎన్నో ఇబ్బందులు పెడితే, మరి ఆరోజు ఎందుకు మీరు లేఖ రాయలేదు. ఇక చాలించండి ముద్రగడ గారు మీ ముసుగు. రాజకీయం, మీరు మీ స్వలాభం కోసం, మీరు ఏదైతే తునిలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉద్యమంలో ఉప్మా పెట్టించాడు అని చెప్పారు. ఆ ఉప్మాకి అయిన ఖర్చులో భాగంగా మేము కూడా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఒక్కొక్కరు పది రూపాయల లెక్కన మీకు పోస్ట్ ద్వారా పంపిస్తున్నాము స్వీకరించండి. అంటే ఎప్పుడు కూడా ముసుగేసుకుని రాజకీయాలు చేయబాకండి, నీతి నిజాయితీగా ఇకనైనా సరే ఇంత వయసు వచ్చింది కళ్ళు తెరిచి కాపులకి మీరేం చేశారు. ప్రభుత్వం ఏం చేసింది, మరి ఎందుకు చేయలేకపోయింది అనేటటువంటి విషయాల మీద మాత్రమే మాట్లాడండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాయడం మీద ఉన్న శ్రద్ధ బూతులు మాట్లాడే వైసీపీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎందుకు రాయలేదయ్యా?. అంటే అవి మీకు బూతులుగా వినిపించడం లేదా ఇకనైనా చాలించండి. కృష్ణా, రామా అనుకుంటూ ప్రశాంతంగా ఉండండి. అంతేకానీ బురదజల్లే పనులు చేయబాకండి. ప్రశాంత్ కిషోర్, వైయస్ జగన్ మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ ఎలా చెప్తే అలా ఆడే పరిస్థితిలో ఉన్నట్టున్నారు. మీ ఆటలు ఇంకా సాగవు. జగన్మోహన్ రెడ్డి ఊబిలో చిక్కుకొన్న మీరు చివరకు కాపు ద్రోహిగా నిలవకండని సురేష్ నాయుడు హితవుపలికారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు పినిశెట్టి మల్లికార్జున్, రహీం, ఖాజా, శ్రీహరి, మస్తానయ్య, వాసు తదితరులు పాల్గొన్నారు.