జనసేన పార్టీ బీసీల సదస్సును జయప్రదం చేయాలి: దూదేకుల ఖాసీం సైదా

గురజాల, మార్చి 11న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అధ్యక్షతన బీసీ సదస్సును మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ యొక్క సదస్సుకు గురజాల నియోజకవర్గంలోని బీసీలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ దూదేకుల ఖాసీం సైదా పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీలు బీసీ సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేశాయని, జనాభాలో సగం మంది బీసీలు ఉన్నా, బీసీల ఉన్నతికి ఏ పార్టీ పాటు పడలేదని, జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల అభివృద్ధికి అత్యధిక ప్రాదాన్యత ఇస్తారని, బీసీల అభివృద్ధి ప్రధాన ఉద్దేశంతో పనిచేసే పార్టీ జనసేన పార్టీ అని, కావున జనసేన బీసీ సభను విజయవంతం చేయాలన్నారు.