డోర్ టు డోర్ పవన్ కళ్యాణ్ సంక్రాంతి శుభాకాంక్షలు

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు 9 డివిజన్ అధ్యక్షులు టీవీవి సత్యనారాయణ ఆధ్వర్యంలో గుడారి గుంట ప్రాంతంలో జనంలోకి జనసేన మరియు పవన్ కళ్యాణ్ గారి సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు ప్రజలకు మొదటిగా తమనాయకులు పవన్ కళ్యాణ్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలను తెలియచేస్తూ స్వీట్స్ అందచేసారు. సానుభూతి, అమాయకత్వం వీటి ప్రభావానికి లోనై ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఎలాంటి ఫలితాలు అనుభవిస్తామో రాష్ట్ర ప్రజలకు అర్ధమైందనీ, జీవితంలో మళ్ళీ ఇలాంటి తప్పు మరల చేయమని ఒట్టు వేసుకున్నారని చెపుతున్నారన్నారు. ఇది ప్రజలలో వచ్చిన చైతన్యానికి ప్రతీక అనీ, వారి సహనానికి హద్దులు దాటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించాడన్నారు. రాబిన్ హుడ్ అనుకుని ఎన్నుకున్న ప్రజలు ఈ నాలుగు సంవత్సరాల పదినెలలు డస్ట్ బిన్ జిడ్డుని భరించారన్నారు. రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీల కూటమికి తమ మద్దతునిచ్చి ప్రజా పాలనను తీసుకురాడానికి తోడ్పడవలసినదిగా కోరుతూ ప్రచారం సాగించారు. ఈ కార్యక్రమంలో సిటీ ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ, దండ్రు లోవరాజు, మహేష్, జాన్, బాబు, కటారి దుర్గ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.