డాక్టర్. సీవీ మధన్ కుమార్ కు అభినందన సత్కారం

కదిరి: కరోనా సమయంలో ఉత్తమ వైద్య సేవలు అందించిన డాక్టర్. సీవీ మధన్ కుమార్ కు భారతసేవారత్న అవార్డ్ వచ్చిన సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత & రామ్ చరణ్ యువ ఫౌండేషన్, మెగా అభిమానుల తరపున సత్కరించుకోడం జరిగింది. ఈ సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు లక్ష్మణ కుటాల మాట్లాడుతూ గ్లోబల్ స్కాలర్స్ ఫౌండేషన్ వారు కరోనా సమయంలో ఉత్తమ వైద్య సేవలు అందించిన ముఖ్యంగా చిన్న పిల్లలకు చేసిన వైద్య సేవలకు, కరోనా సమయంలో చాలా మంది భయపడుతూ బయటకు రాలేని పరిస్థితుల్లో కూడా ఆన్లైన్ సర్వీస్ ప్రారంభించి, ఎవరూ అధైర్య పడవద్దు అంటూ సలహాలు సూచనలు అందిస్తూ క్వారంటైన్ సెంటర్స్ ఏర్పాటు చేసి వారికి కావలసిన మెడికల్ కిట్స్ అందిస్తూ నిత్యం పర్యవేక్షిస్తూ ఉత్తమమైన సేవలు అందించిన డాక్టర్. సీవీ మధన్ కుమార్ కు భారతసేవారత్న అవార్డ్ రావడం కదిరి పట్టణ ప్రజలందరికీ గర్వకారణం. ఇది నిస్వార్థ సేవకు దక్కిన గౌరవంగా భావిస్తున్నమని లక్ష్మణ కుటాల తెలిపారు. ఈ కార్యక్రమంలో నంది శెట్టి బాబు, హరి బాబు, ముజీబ్, షాకీర్, రాజేంద్ర ప్రసాద్, నవీన్ బక్కసం తదితరులు పాల్గొన్నారు.