జనసైనికుడు నరసింహను పరామర్శించిన జనసేన నాయకులు

వనపర్తికి చెందిన జనసైనికుడు పి.నరసింహ ఇటీవల బైక్ యక్సిడెంట్ కు గురై చికిత్స నిమిత్తం సర్జరీ చేయించుకోవడం జరిగింది. విషయం తెలుకున్న జనసేన జిల్లా ముఖ్య నాయకులు రాకేష్ రెడ్డి, బాలకృష్ణ మరియు చిన్నమందడి సురేష్ బుధవారం జనసైనికుడు పి.నరసింహను పరామర్శించి, యాక్సిడెంట్ గురించి మరియు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని వారికి మనోధైర్యాన్ని నింపుతూ పార్టీ వారికి అండగా వుంటుందని తెలిపారు.