మృతురాలి కుటుంబానికి డాక్టర్ కందుల ఆర్థిక సహాయం

విశాఖ దక్షిణ నియోజకవర్గం, స్థానిక 32వ వార్డులో మృతి చెందిన నిరుపేదరాలు లక్ష్మి కుటుంబానికి దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అండగా నిలిచారు. కుటుంబ సభ్యులను కలిసి వారికి ఆర్థిక సహాయం చేశారు. నియోజకవర్గంలో ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా ముందుండి వారికి సహాయం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి తన సహాయం ఎప్పుడు ఉంటుందని తెలిపారు. ఇప్పటికే నిర్వహిస్తున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది పేదవారిని కలిసి వాళ్ల సమస్యలను అడిగి తెలుసుకుని తన పరిధి మేరకు వారికి సహాయం చేస్తున్నానని వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా చేస్తున్న ఈ సహాయ కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్.చిట్టమ్మ, కేదార్నాథ్, బద్రీనాథ్, జానకి, వర, ఝాన్సీ, కుమారి, దుర్గ తదితరులు పాల్గొన్నారు.