డాక్టర్.మాధవ రెడ్డి ఆధ్వర్యంలో మహాత్మునికి ఘననివాళి

తెలంగాణ, శేరిలింగంపల్లి, సోమవారం గాంధీ జయంతి సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మదీనాగూడలో గల మహాత్మా గాంధీ విగ్రహానికి జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ మాధవ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి జనసేన పార్టీ నాయకులు రమేష్, ప్రదీప్, పుష్ప, మద్దూరి నాగలక్ష్మి, శ్రవణ్, హనుమంత్ నాయక్, హరి నాయక్ మరియు ఇతర జనసైనికులు పాల్గొన్నారు.