మహాత్ముని ఆశయ సాధన జనసేనతోనే సాధ్యం

  • జనసేన నాయకులు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్

సింగనమల: మహాత్మా గాంధీ ఆశయ సాధన జనసేనపార్టీ తోనే సాధ్యమని కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం జనసేన పార్టీ నాయకులు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ 154వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జనసేనపార్టీ జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవరాయుడు హాజరయ్యారు. ముందుగా వారి మండల కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద గల గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి సంజీవరాయుడు, సీనియర్ నాయకులు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సత్యం, అహింసా మార్గాలను ఎంచుకుని తెల్లదొరల కబంద హస్తాల నుండి భరతమాత సంకెళ్లని తెంచి స్వాత్రంత్ర ఫలాలను అందించి ప్రపంచ దేశాలకు బాపు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాముల శ్రీనివాసులు, రహమతుల్లా, చింతా రామకృష్ణ, యశ్వంత్, అశోక్, గిరీష్, భాను, చిన్నా, ప్రమోద్, అమీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.