శ్రీ డాక్టర్ ఉమారాలీషా వార్షిక మహా సభల్లో పాల్గొన్న డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం పట్నం నందు శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక గురువు, శ్రీ డాక్టర్ ఉమర్ అలీషా వారి ప్రతి సంవత్సరం మూడు రోజులు పాటూ జరిగే వార్షిక మహా సభల్లో భాగంగా గురువారం మొదటి రోజు సభలో ముఖ్య అతిథులుగా పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు, శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ పాల్గొని గురువువారి ఆశీర్వాదాన్ని పొందారు. ఈ కార్యక్రమంలో భాగంగా గోకివాడ ఎక్స్ సర్పంచ్ గరగా సత్యానందం, పల్నాటి మధు, బిజెపి నాయకులు పిల్లా ముత్యాలరావు దుడ్డు రాంబాబు, కూరడా సత్తిబాబు, పిల్లా వీరబాబు, మరియు జనసైనికులు కుటుంబ సభ్యులతో పాల్గొనడం జరిగింది.