కాకర్ల రాజేష్ కుమార్ ని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం: డాక్టర్ పిల్లా శ్రీధర్ కు ఎంతో ఆప్తులు అయిన పిఠాపురం నియోజకవర్గం, కొండెవరం గ్రామానికి చెందిన కాకర్ల బాబ్జి కుమారుడు ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్ నందు చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రావడం జరిగింది. విషయం తెలుసుకున్న పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ కాకర్ల రాజేష్ కుమార్ ను శుక్రవారం పరామర్శించి అనంతరం వారి యొక్క ఆరోగ్య ఖర్చులు నిమిత్తం కొంతమేర ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కంద చక్ర బాబు, ఎక్స్ ప్రెసిడెంట్ గరగా సత్యనందరావు, బొజ్జ గోపికృష్ణ, పల్నాటి మధు బాబు, మరియు జనసైనికులు పాలుగొనడం జరిగింది.