బర్రె పాప కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, కొత్త ఇసుకపల్లి జొన్నల కరువు నందు బర్రె పాప అకాల మరణానికి చింతిస్తూ పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు మరియు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం అందించడం జరిగింది. అనంతరం వారి యొక్క కుటుంబం అవసరాల నిమిత్తం 50 కేజీల బియ్యం అందించడం జరిగింది. దీనిలో భాగంగా ఇసుకపల్లి జనసేన నాయకులు కోన రాము ఆ కుటుంబానికి కొంతమేర ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కోనా రాము, మేడిశెట్టి కామేష్, బొజ్జ గోపికృష్ణ, కారపురెడ్డి వెంకటేష్, బర్రె సత్తిబాబు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.