తెప్పల సత్తీయమ్మ కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, ఉప్పాడ కొత్తపల్లి మండలం, ఉప్పాడ అమీనాబాద్ నందు తెప్పల సత్తీయమ్మ అకాల మరణానికి చింతిస్తూ పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ వారి కుటుంబాన్ని పరామర్శించి, మనోధార్యాన్ని అందించడం జరిగింది. అనంతరం వారి యొక్క కుటుంబ అవసరాల నిమిత్తం బియ్యం బస్తా మరియు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మత్స్కార నాయకులు కంబాల దాసు, మత్స్కార నాయకులు పల్లేటి బాపన దొర, వంకా కొండబాబు, బొంతుల వెంకటరావు, పల్నాటి మధుబాబు, బోజ్జ గోపికృష్ణ, రాజు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.