కంటి చూపు కోల్పోయిన వ్యక్తి కుటుంబానికి అండగా డాక్టర్ శ్రీధర్ పిల్లా

పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ గ్రామం నందు గత కొంతకాలంగా కంటి సమస్యతో బాధపడుతు కంటి చూపుకు దూరమైనటువంటి కొప్పడా సత్తిబాబు, వారి యొక్క కుటుంబ పరిస్థితుల్ని ఉప్పాడ జనసైనికుల ద్వారా తెలుసుకున్న పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా ఆ కుటుంబాన్ని కలవడం జరిగింది. అనంతరం ఆ కుటుంబ అవసరాల నిమిత్తం 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయంగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆకుల లావరాజు, ఎస్ సురేష్, కే నాగరాజు, వి మణి, పి నూకరాజు, కే దుర్గారావు, పలివెల నాని, వెన్నుపోతుల వీరబాబు, కె రవి, కొత్తపల్లి రాజు, గేదెల వెంకటరావు, సోమి రవికిరణ్, మైలపల్లి రాజు, మరియు అధిక మొత్తంలో జనసైనికులు పాల్గొనడం జరిగింది.