దృష్టిలోపం వల్ల అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు అండగా డాక్టర్ శ్రీధర్ పిల్లా

పిఠాపురం నియోజకవర్గం, ఉప్పాడ గ్రామం నందు ఎస్సీ పేటలో గత కొంతకాలంగా దృష్టిలోపం వల్ల అనారోగ్యంతో బాధపడుతున్న పలివెల్ల సత్తిబాబు కుటుంబాన్ని పరామర్శించిన పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా ఆ కుటుంబానికి 25 కేజీలు బియ్యం ఆర్థిక సహాయంగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలివెల నాని బాబు, కే రాజు, ఆకుల లావరాజు, రవి, జాన్సన్, సింగిల్ మల్లి, సురేష్, రవి, పెద్ద, మరియు జనసైనికులు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.