ప్రమాదవశాత్తు మరణించిన కొవ్వూరు లావణ్య కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ శ్రీధర్ పిల్లా

పిఠాపురం నియోజకవర్గం కోనపాపపేట గ్రామం నందు ప్రమాదవశాత్తు మరణించినటువంటి కొవ్వూరి లావణ్య కుటుంబాన్ని మత్స్యకార నాయకులు కంబాల దాసు మరియు మత్స్యకార నాయకులు పల్లెటి బాపన్న దొర సమక్షంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా ఎం.డి జనరల్ మెడిసిన్ పరామర్శించి కుటుంబానికి మనోధైర్యం నింపడం జరిగింది. అనంతరం ఆ కుటుంబ అవసరాల నిమిత్తం ఒక నెలకు సరిపడా 50 కేజీల బియ్యం నిత్యవసర సరుకులు ఆర్థిక సహాయంగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మత్స్యకార నాయకులు కంబాల దాసు, మత్స్యకార నాయకులు పల్లేటి బాపన్న దొర, పిరాది అప్పారావు, సురాడ గణేష్, పుక్కుల కుమార్, డి శ్రీను, బి స్వామి, సిహెచ్ రాజు, పి మారియా, ఏ సతీష్, మెరుగు మాన్నియ్య, మెరుగు సత్తియ్య, కొవ్వూరు అచ్చయ్య మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.