జనసేన పార్టీ ఆధ్వర్యంలో జగనన్న కాలనీలు మరియు టిడ్కో ఇళ్ల పరిశీలన మరియు సోషల్ ఆడిట్: బొటుకు రమేష్ బాబు

దర్శి, జనసేన పార్టీ దర్శి నియోజకవర్గ ఇంచార్జి బొటుకు రమేష్ బాబు ఆదివారం దర్శి జనసేన పార్టీ కార్యాలయంలో దర్శి మండలం లంకోజినపల్లి గ్రామ నాయకులు కోటేశ్వరరావు మరియు వెంకటాచలంపల్లి గ్రామ నాయకులు గంగిశెట్టి లక్ష్మీనారాయణలను కలిసి జనసేన పార్టీలో చేరవలసిందిగా కోరారు. వారు ఇరువురు తమ తమ గ్రామాలకు చెందిన తమ అనుచరులతో కలిసి త్వరలో జనసేన పార్టీలో చేరుతామని వాగ్దానం చేశారు. తదనంతరం నాయకులు అందరు జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈనెల పన్నెండు, పదమూడు మరియు పద్నాలుగు తేదీలలో తలపెట్టిన జగనన్న కాలనీలు మరియు టిడ్కో ఇళ్ల పరిశీలన, వాటి పురోగతి, నిపుణులతో సోషల్ ఆడిట్ మరియు లబ్ధిదారులను కలిసి వారి సమస్యలు తెలుసుకోవడం కార్యక్రమాన్ని దర్శి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో చేపట్టేందుకు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ముండ్లమూరు మండల కమిటీ అధ్యక్షులు తోట రామారావు, కురిచేడు మండల కమిటీ అధ్యక్షులు మాదా వెంకట శేషయ్య, దర్శి నగర పంచాయితీ అధ్యక్షులు చాతిరాశి కొండయ్య, దర్శి మండల ప్రధాన కార్యదర్శి ఉప్పు ఆంజనేయులు, దర్శి మండల నాయకులు పుప్పాల పాపారావు, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు పుప్పాల రుద్రా, కురిచేడు మండల కమిటీ ఉపాధ్యక్షులు మంచాల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.