గోసల శాంతిని పరామర్శించిన డా.వీర ప్రసాద్

కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గం, యు.కొత్తపల్లి మండలం మాయపట్నం కొత్త కాలనీలో జనసేన పార్టీ ఇన్చార్జ్ మాకినీడి శేషుకుమారి ఇటీవల జరిగిన మత్స్యకార మహిళల ఆత్మీయ సమావేశంలో మత్స్యకార ఆడబడుచు గోసల శాంతి అనారోగ్యంతో బాధపడుతుందని తెలియడంతో, ఆమెకు తోచిన సాయం చేయండి అని చెప్పటంతో డాక్టర్ మాకినీడి వీర ప్రసాద్ ఆమెని పరీక్షించడం జరిగింది. ఆమె పరిస్థితి చూసి కాకినాడ బెస్ట్ హాస్పటల్ కు రిఫర్ చేసి అక్కడ డాక్టర్ తో మాట్లాడి ఆపరేషన్ తక్కువ ఖర్చుతో చేయించడం జరిగింది. ఆమె డిస్చార్జ్ అయ్యి ఇంటికి రావడంతో డా.వీర ప్రసాద్ వెళ్లి ఆమెను పరీక్షించి ఆమె ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. గోసల శాంతి వారి కుటుంబ సభ్యులు అడగ్గానే ఈ సాయం చేసినందుకు డా.వీర ప్రసాద్ మరియు జనసేన ఇన్ఛార్జ్ శేషు కుమారికి ఎప్పుడు రుణపడి ఉంటామని అన్నారు. అక్కడే ఇంకొక నలుగురిని కూడా పరీక్షించి వైద్యసలహాలందించారు. ఈ కార్యక్రమంలో యు కొత్తపల్లి జనసేన మండల ప్రెసిడెంట్ పట్టా శివ, సూరాడ శ్రీను, దొడ్డి దుర్గాప్రసాద్, పంతాడ దుర్గాప్రసాద్, రాజు, సొలోమను, సూరాడ దుర్గాప్రసాద్, పట్టా యోహాను, తిక్కడ గోవిందు, తిక్కడ నాగు, గోసాల రమణ, పసుపులేటి దుర్గాప్రసాద్, గ్రామ మహిళలు జనసైనికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.