జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో త్రాగునీరు

తూర్పుగోదావరి జిల్లా, రాజోలు వేసవి కాలంలో నీటి ఎద్దడికి ప్రజలు ఇబ్బందిపడుతుండడంతో జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ప్రతిరోజు ప్రజలకు మంచి నీళ్ళు అందేవిధంగా వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాటర్ ట్యాంక్ ద్వారా సోమవారం గొంది గ్రామంలో నీరు అందక ఇబ్బందులు పడుతున్న వారికి జనసేన నాయకులు రావూరి నాగు ట్రాక్టర్ డిజల్ కి ఆర్ధిక సహకారం అందించగా ఖర్చులతో గత నాలుగు రోజులుగా గొంది జనసైనికుల ద్వారా త్రాగునీరు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొనడం జరిగింది.