తాండూరులో శంకర్ గౌడ్ ఎన్నికల ప్రచారం

తెలంగాణ, తాండూరు బిజెపి పార్టీ కార్యాలయంలో బీజేపీ మరియు జనసేన ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా బీజేపీ బలపరిచిన తాండూరు నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్ధి నేమూరి శంకర్ గౌడ్ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి కలిసి ముందుకు వెళ్లాలి అని పిలుపునిచ్చారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ప్రచారంలో భాగంగా అందరికి అభివాదం చేస్తూ జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసుపై తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది. జనసేన పార్టీ సిద్ధాంతాలతో కూడిన కరపత్రాలను పంచుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజేపి నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.